మోసపోయిన బుల్లితెర నటి

TV Artist Sushmitha Complaint On Fraud Case In Karnataka - Sakshi

సాక్షి, యశవంతపుర(కర్ణాటక): రాష్ట్రస్థాయి పదవి ఇప్పి స్తామని బుల్లితెర నటి నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటన అన్నపూర్ణేశ్వరినగర పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. రఘ చంద్రప్ప, సంగీత  అనే ఇదరు తన వద్ద రూ. 10 లక్షలు నగదు తీసుకుని మోసం చేశారని బుల్లితెర నటి సుశ్మిత ఇటీవల అన్నపూర్ణేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాలు... ఆదిశక్తి మహిళ సంఘం రాష్ట్రస్థాయి మహిళా అధ్యక్షరాలిగా నియమిస్తామంటూ నమ్మించి సుశ్మిత నుంచి వీరు రూ. 10 లక్షలు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా కూడా నియామకం జరగక పోవడంతో పాటు నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో ప్రాణాలు తీస్తామని వారు హెచ్చరించినట్లు సుశ్మిత పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సరోజ అనే మహిళ వద్ద కూడా వీరు డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top