క్రికేట్‌ ఆడుతుండగా విషాదం.. ముగ్గురు మృతి | Thunderbolt Fell On Children 3 Died In Guntur | Sakshi
Sakshi News home page

క్రికేట్‌ ఆడుతుండగా విషాదం.. ముగ్గురు మృతి

May 14 2018 6:50 PM | Updated on Aug 24 2018 2:33 PM

Thunderbolt Fell On Children 3 Died  In Guntur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గుంటూరు : పిడుగుపాటుకు ముగ్గురు పిల్లలు మృతి చెందటం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా గురజాల మండలం సమాధానంపేటలో సోమవారం చోటుచేసుకుంది. క్రికెట్‌ ఆడుకుంటున్నపిల్లలపై పిడుగు పడటంతో పవన్ నాయక్(16) హరిబాబు(15) మనోహర్ నాయక్(12)లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలపాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. తమ పిల్లలు ఇక తిరిగిరారని తెలిసిన ఆ కుటుంబ సభ్యులు గుండలవిసేలా రోదించారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement