ఘోర ప్రమాదం : ముగ్గురు విద్యార్థుల మృతి

Three Killed In Road Accident It Gujarat - Sakshi

అహ్మదాబాద్ : గుజరాత్‌తో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని దంగ్‌ జిల్లాలో కాలేజీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. దంగ్‌ జిల్లాలోని మహాల్- బర్దిపాడ మార్గంలో ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. లోయ లోతు ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top