రాకెట్‌ దాడిలో యువ క్రీడాకారుడి మృతి | Syrian child footballer killed by shells on Damascus | Sakshi
Sakshi News home page

రాకెట్‌ దాడిలో యువ క్రీడాకారుడి మృతి

Mar 25 2018 8:48 AM | Updated on Oct 2 2018 8:39 PM

Syrian child footballer killed by shells on Damascus - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

డమాస్కస్‌: సిరియాలో మారణహోమం కొనసాగుతూనే ఉంది. తాజాగా రెబెల్‌ గ్రూపు జరిపిన రాకెట్‌ దాడిలో ఓ యువ పుట్‌బాల్‌ క్రీడాకారుడు మృతిచెందాడు. మరో ఏడుగురు క్రీడాకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సిరియా రాజధాని డమాస్కస్‌ శివారులోని ఓ స్పోర్ట్స్‌ క్లబ్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్న సమయంలో జరిగింది. ఈ సంఘటనలో మృతిచెందినది సమీర్‌ మహ్మద్‌ మౌస్సూద్‌ అనే 12 ఏళ్ల బాలుడిగా గుర్తించినట్లు సిరియన్‌ ఆర్మీస్‌ పుట్‌బాల్‌ టీం అధ్యక్షుడు మోహసీన్‌ అబ్బాస్‌ తెలిపారు.

మౌస్సూద్‌,సిరియన్‌ ఆర్మీ పుట్‌బాల్‌ టీం యూత్‌ లీగ్‌లో ఆడుతున్నాడని, అల్‌-ఫేయాహా స్పోర్ట్స్‌ క్లబ్‌లో వారు శిక్షణ తీసుకుంటున్నాడని వివరించారు. గాయపడిన క్రీడాకారులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో రెబెల్‌ గ్రూపు ఈ స్పోర్ట్స్‌ క్లబ్‌పై పలుమార్లు దాడి చేసిందని తెలిపారు. గత మంగళవారం రాజధానిలో రెబెల్‌ గ్రూపు జరిపిన బాంబుదాడిలో 44  మంది పౌరులు మృతిచెందిన సంగతి తెల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement