ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురి దుర్మరణం | Road Accident In Odisha Kalahandi | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి

May 22 2019 11:54 AM | Updated on May 22 2019 11:55 AM

Road Accident In Odisha Kalahandi - Sakshi

భువనేశ్వర్‌: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన కలహండి జిల్లా భవానీపాట్నా సమీపంలో జాతీయ రహదారి 26పై బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబందించి  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement