కన్నకొడుకుని కాల్చిచంపాడు.. | A Police Officer Allegedly Killed His Son Inside A Police Station | Sakshi
Sakshi News home page

స్టేషన్‌లోనే కుమారుడిని కాల్చిచంపిన ఖాకీ

Oct 25 2019 12:02 PM | Updated on Oct 25 2019 12:07 PM

A Police Officer Allegedly Killed His Son Inside A Police Station - Sakshi

పోలీస్‌ స్టేషన్‌లోనే హెడ్‌ కానిస్టేబుల్‌ తన కుమారుడిని కాల్చిచంపిన ఘటన గోరఖ్‌పూర్‌లో వెలుగుచూసింది.

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. గురువారం చౌరీ-చౌరా పోలీస్‌ స్టేషన్‌లో చిన్నపాటి వాగ్వాదంతో హెడ్‌కానిస్టేబుల్‌ అరవింద్‌ యాదవ్‌ ఏకంగా కన్న కుమారుడినే కాల్చిచంపిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో నిందితుడు అరవింద్‌ యాదవ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆయన లైసెన్స్డ్‌ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తండ్రీకొడుకుల మధ్య చిన్నపాటి వివాదంతో ఆగ్రహంతో ఊగిపోయిన అరవింద్‌ యాదవ్‌ కుమారుడిపై కాల్పులు జరపగా ఘటనా స్థలంలోనే బాధితుడు మరణించాడని సీఐ సుమిత్‌ శుక్లా తెలిపారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి అతడి నుంచి లైసెన్స్డ్‌ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మృతుడిని నిందితుడి మొదటి భార్య కుమారుడు, ఘజీపూర్‌లో నివసించే వికాస్‌ యాదవ్‌గా గుర్తించామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement