దొంగను చేసిన క్రికెట్‌ బెట్టింగ్‌!

Muthoot Finance Manager Stealing Surety Gold - Sakshi

వి.కోట ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దారుణం

తనాఖా పెట్టిన నగలతో బ్రాంచి మేనేజర్‌ క్రికెట్‌ బెట్టింగ్‌

విషయం వెలుగులోకి రావడంతో ఆత్మహత్యాయత్నం 

సాక్షి, చిత్తూరు : క్రికెట్‌ బెట్టింగ్‌ ఓ ఫైనాన్స్‌ కంపెనీ మేనేజర్‌ను దొంగను చేసింది. జిల్లాలోని  వి.కోట ముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచిలో మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రకాశ్‌ ఏకంగా తనాఖా పెట్టిన నగలను బెట్టింగ్‌ కాసి పోగొట్టుకున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా కాజేసిన 2 కేజీల నగల స్థానంలో నకిలీ బంగారు నగలను పెట్టాడు.

ఈ విషయం వెలుగులోకి రావడంతో మనస్థాపంతో  ప్రకాశ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top