తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌ ఆత్మహత్య | The mother-child Express driver committed suicide | Sakshi
Sakshi News home page

తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

Apr 10 2018 10:48 AM | Updated on Nov 6 2018 8:16 PM

The mother-child Express driver committed suicide - Sakshi

మృతిచెందిన సన్యాసిరావు 

రాజాం సిటీ /వంగర: స్థానిక సామాజిక ఆస్పత్రిలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న డర్రు సన్యాసిరావు (రమేష్‌) (32) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం వరకు విధులు నిర్వహించిన ఆయన.. వాహనంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

దీనిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది స్పందించి చికిత్సనందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మృతుడికి భార్య సంధ్య, ఇద్దరు కుమారులు, తల్లి ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందాల్సి ఉంది. వంగర మండలం బాగెంపేట గ్రామానికి చెందిన సన్యాసిరావు (రమేష్‌) మృతితో బాగెంపేట గ్రామం శోకసంద్రంలో మునిగింది.

రెండున్నరేళ్లుగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌గా పనిచేస్తు అందరితో స్నేహభావంగా ఉండేవాడని, ఎందుకు ఇలాంటి పనిచేశాడో తెలియదని వాపోతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన సన్యాసిరావు లారీ డ్రైవర్‌గా, ఆటో డ్రైవర్‌గా కొంతకాలం పనిచేశారు. విషయం తెలుసుకున్న బంధువులు రాజాం సామాజిక ఆస్పత్రికి చేరుకొని మృతదేహం వద్ద  విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement