రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడి మృతి

mother and son died in accident - Sakshi

పశ్చిమ గోదావరి జిల్లా : ఏలూరు నగరం తంగెళ్లమూడి సమీపంలోని పంటకాలువ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తల్లీకుమారుడు మృతిచెందారు. మోటారు సైకిల్‌పై తల్లీకుమారుడు వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు స్థానికంగా నివాసం ఉంటున్న మంగ(45), సాయి(20)గా గుర్తించారు. తల్లి స్థానికంగా ఉన్న హీరోహోండా షోరూంలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. రోజూ మాదిరి పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top