మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం | Marriage Party Tragedy-20 Killed As Truck Falls Off Sone River ridge | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Apr 18 2018 7:20 AM | Updated on Oct 8 2018 3:19 PM

Marriage Party Tragedy-20 Killed As Truck Falls Off Sone River ridge  - Sakshi

సంఘటనాస్థలంలో స్థానికులు

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సిధి జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ మినీ ట్రక్కు ప్రమాదవశాత్తూ అమేలియా  ప్రాంతంలో జోగ్దాహా బ్రిడ్జిపై నుంచి సోన్‌ నదిలో సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే మృతిచెందారు.

మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని స్థానిక జిల్లా కలెక్టర్‌ దిలిప్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. గాయపడిన వారిని దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల తక్షణ సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement