మెట్రో రైలు కింద దూకి వ్యక్తి ఆత్మహత్య | Man Jumps In Front Of Metro Dies In Kolkata | Sakshi
Sakshi News home page

మెట్రో రైలు కింద దూకి వ్యక్తి ఆత్మహత్య

Aug 11 2019 10:01 AM | Updated on Aug 11 2019 10:05 AM

Man Jumps In Front Of Metro Dies In Kolkata - Sakshi

కోల్‌కత్తా: కదులుతున్న మెట్రో రైలు కిందకు దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని డమ్‌డమ్‌ మెట్రో రైల్వే స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. రైలు పట్టాలపైకి దూకగానే ట్రైన్‌ ఆపి.. అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లామని, కానీ అతను అప్పటికే మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తిని ప్రకాశ్‌ షా (40)గా అధికారులు గుర్తించారు. 

కాగా అతని మృతికి కారణాలు తెలిసిరాలేదని మెట్రో సీపీఆర్‌ఓ ఇద్రాణి ముఖర్జీ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టామని వెల్లడించారు. కాగా వ్యక్తి ఆత్మహత్య కారణంగా ఆ మార్గంలో రెండు గంటల పాటు మెట్రో సేవలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర  ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement