
ఆదివారం ఉదయం తిరుపతమ్మ గుడివద్ద మృతిచెంది ఉన్నాడు. యువతి బంధువులే అవినాష్ను హత్యచేసి ఉంటారని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
సాక్షి, ఒంగోలు : పట్టణంలోని గోపాల్నగర్లో ఉద్రికత్త చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడు మృతి చెందాడు. ప్రేమిస్తున్నానని చెప్పి నిన్న (శనివారం) ఓ ఇంటి ఎదుట అవినాష్రెడ్డి ఆందోళన చేశాడు. ఆదివారం ఉదయం తిరుపతమ్మ గుడివద్ద మృతిచెంది ఉన్నాడు. యువతి బంధువులే అవినాష్ను హత్యచేసి ఉంటారని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమించిన యువతి దక్కదనే కారణంగా యువకుడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.