
సాక్షి, ప్రకాశం : ఒంగోలు కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. కాలేజీలో ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న లహరి అనే విద్యార్థిని బిల్డింగ్ మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది పక్కనే ఉన్న సంఘమిత్ర ఆసుపత్రికి తరలించారు. అయితే తల్లిదండ్రులకు దూరంగా ఉండటంతో ఒత్తిడికి గురై ఉండవచ్చని అందుకే విద్యార్థి లహరి ఆత్మహత్యాయత్నం చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విద్యార్థిని కోలుకుంటుందని కళాశాల ఛాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు.