
మృతురాలు వల్లాల లక్ష్మీ
గుంటూరు : భర్త చేతిలో భార్య హత్యకు గురైన సంఘటన బెల్లంకొండ మండలంలోని చండ్రాజుపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వల్లాల లక్ష్మి, ఏడుకొండలు భార్యాభర్తలు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్యను గొంతు నులిమి తానే హతమార్చినట్లు భర్త వల్లాల ఏడుకొండలు తెలిపారు. అనంతరం బెల్లంకొండ పోలీసుల సమక్షంలో ఏడుకొండలు లొంగిపోయాడు. ఈ ఘటనపై రాజుపాలెం ఇంచార్జి ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.