బాలిక దారుణ హత్య: తండ్రిపైనే అనుమానం!

Girl Murder In Medchal Police Enquiry - Sakshi

కలకలం రేపిన మేడ‍్చల్‌ బాలిక హత్య

తండ్రిపై అనుమానం వ్యక్తం చేస్తోన్న పోలీసులు

విచారణ మరింత ముమ్మరం

సాక్షి, మేడ్చల్‌: నిన్న జరిగిన మేడ్చల్‌ బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాలిక కన్న తండ్రే దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్న పోలీసులు  అతన్ని విచారిస్తున్నారు. పోలీసులకు అతను పొంతనలేని సమాధానాలు చెపుతుండడంతో అతని తీరుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన బాలిక నిందితుడి మొదటి భార్య కూతురిగా పోలీసులు గుర్తించారు. రెండు నెలల క్రితం తుఫ్రాన్‌పేట్‌ నుంచి కుటుంబంతో మేడ్చల్‌కు వారి కుంటుంబం వలస వచ్చినట్లు తెలిసింది. 

కాగా మేడ్చల్‌లోని ఓ బస్తీ సమీపంలో శనివారం గోనెసంచిలో 14 ఏళ్ల ఓ బాలిక మృతదేహం లభించడం కలకలం రేపిన విషయం తెలిసిందే.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక గొంతుకోసి, ఆనవాళ్లు గుర్తించకుండా కనుగుడ్లు పీకి, మొహంచెక్కి అత్యంత కిరాతకంగా హతమార్చారు. అనంతరం గోనెసంచిలో కుక్కి.. సమీపంలోని చెత్తకుండిలో పడేశారు. బాలికను ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా? లేక ఆమె స్థానికురాలేనా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే బాలిక తండ్రిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు దానికి అనుగుణంగా విచారణ చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top