ప్రజలకు చిక్కారు... చచ్చారు!

Four lynched in Bihar's Rohtas after failed extortion bid - Sakshi

పాట్నా: బలవంతమైన సర్పం చలి చీమల చేత చిక్కి చావదే సుమతి అన్నట్లు ప్రజలను బాధించిన నలుగురు నేరస్తులు చివరకు వారి చేతిలోనే చావాల్సి వచ్చింది. ఈ సంఘటన బిహార్‌ రాష్ట్రంలోని ఓ గ్రామంలో జరిగింది. రోహ్తా జిల్లా కోత్‌ ప్రాంతంలో ఓ వ్యక్తిపై నలుగురు నేరస్తులు తుపాకితో కాల్పులు జరిపారు. జిల్లా కౌన్సిల్‌ మెంబర్‌ భర్త అయిన అరుణ్‌ చౌదరి నుంచి డబ్బులు లాక్కెళ్లే ప్రయత్నంలో ఆయనపై కాల్పులు జరపగా అది గురితప్పింది. బుల్లెట్‌ తగిలి మరో వ్యక్తి గాయపడ్డాడు.

ఈ కాల్పుల శబ్దం విని స్థానికులు పరుగున వచ్చి పారిపోతున్న ఆ నలుగురిని ఛేజ్‌ చేసి పట్టుకున్నారు. కర్రలు, ఇటుకలతో కొట్టడంతో వారు నలుగురూ అక్కడికక్కడే మృతిచెందారని, వారు 20 ఏళ్ల లోపు ఉంటారని పోలీసు అధికారి అలోక్‌ కుమార్‌ తెలిపారు. మృతులను ఇంకా గుర్తించలేదన్నారు. బిహార్‌లో ఇలా జనం చేతిలో ఈ సంవత్సరంలో చనిపోయిన సంఘటనలు రెండు డజన్ల వరకు ఉంటాయని తెలుస్తోంది. , ,

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top