చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Four killed in chittor road accident | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Oct 13 2017 5:38 PM | Updated on Oct 13 2017 6:54 PM

Four killed in chittor road accident

సాక్షి, చిత్తూరు : జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఏర్పేడు మండలం ల్యాంకో ఫ్యాక్టరీ సమీపంలో ఆగివున్న లారీని ఓ కారు వేగంగా ఢీకొనడంతో  అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని, శ్రీకాళహస్తి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడు సుందరమూర్తిగా పోలీసులు గుర్తించారు.  వీరంతా తమిళనాడుకు చెందినవారుగా భావిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement