మంచు.. వాహనం ఢీకొని సైక్లిస్టు దుర్మరణం | Sakshi
Sakshi News home page

మంచు.. వాహనం ఢీకొని సైక్లిస్టు దుర్మరణం

Published Mon, Jan 29 2018 9:43 AM

fog.. cyclist died in an accident

సాక్షి, చిట్యాల: మంచు కారణంగా రహదారిపై ముందు ఉన్నది ఏదీ కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రంపల్లిలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. సైకిల్‌పై వెళుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని కంకల వెంకటేశ్(30)గా గుర్తించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement