కూతురిపై అనుమానం.. పరువు హత్య..! | Father Murder His Daughter In Krishna district | Sakshi
Sakshi News home page

Jun 30 2018 5:18 PM | Updated on Jul 30 2018 8:41 PM

Father Murder His Daughter In Krishna district - Sakshi

సాక్షి, కృష్ణా : కృష్ణా జిల్లాలో శనివారం పరువు హత్య జరిగింది. కన్న తండ్రే కూతుర్ని గొడ్డలి కర్రతో కొట్టి చంపేశాడు. ఈ ఘటన జిల్లాలోని చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో చోటుచేసుకుంది. కూతురిపై అనుమానంతో తండ్రి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తన కూతురు వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని ఆ తండ్రి అనుమానించాడు. ఆ యువతి ఇంటి ఆవరణలో ఫోన్‌ మాట్లాడుతున్న సమయంలో తండ్రి దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. 

ఆ యువతి(22)  బీఫార్మసీ చదువుతోందని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement