కూతురిపై అనుమానం.. పరువు హత్య..!

Father Murder His Daughter In Krishna district - Sakshi

సాక్షి, కృష్ణా : కృష్ణా జిల్లాలో శనివారం పరువు హత్య జరిగింది. కన్న తండ్రే కూతుర్ని గొడ్డలి కర్రతో కొట్టి చంపేశాడు. ఈ ఘటన జిల్లాలోని చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో చోటుచేసుకుంది. కూతురిపై అనుమానంతో తండ్రి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తన కూతురు వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని ఆ తండ్రి అనుమానించాడు. ఆ యువతి ఇంటి ఆవరణలో ఫోన్‌ మాట్లాడుతున్న సమయంలో తండ్రి దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. 

ఆ యువతి(22)  బీఫార్మసీ చదువుతోందని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top