రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని..

Father Kills Baby Girl in Bhadradri Kothagudem - Sakshi

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం  

సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని నెల రోజుల పసికందును కన్నతండ్రే నీటి తొట్టిలో ముంచి హత్య చేసిన ఘటన చర్ల మండలం రేగుంటలో జరిగింది. సూర్యతేజ, అఖిల దంపతులకు ఇటీవలే ఆడబిడ్డ జన్మించింది. ఈ క్రమంలోనే తెల్లవారుజామున చిన్నారి కనిపించకపోవడంతో భర్త సూర్యతేజను అఖిల నిలదీసింది. సూర్యతేజ పొంతనలేని సమాధానాలు చెప్తుండటంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టిందన్న అక్కసుతో సూర్యతేజనే ఈ దురగతానికి ఒడిగట్టాడని అఖిల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top