హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

Directorate Of Revenue Officers Captured Huge Gold In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఈస్ట్‌మారేడుపల్లిలోని షైన్‌ హాస్పిటల్‌పై దాడులు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు.. నలభై బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. రెండు కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని ఇద్దరు వ్యక్తులు కారులో క్యాలికట్‌ నుంచి మైసూర్‌ మీదుగా హైదరాబాద్‌కు తరలించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి విచారిస్తున్నారు. నిందితుల నుంచి రూ.2కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top