వీడియో వైరల్‌: వెంబడించి మరీ లాక్కెళ్లారు | Chain Snatching In Palasa Kasibugga Municipality In Srikakulam | Sakshi
Sakshi News home page

Jul 27 2018 5:55 PM | Updated on Jul 27 2018 6:46 PM

Chain Snatching In Palasa Kasibugga Municipality In Srikakulam - Sakshi

మహిళను వెంబడిస్తున్న దొంగ (సీసీటీవీ చిత్రం)

ఉషారాణి శుక్రవారం సాయత్రం తమ ఇంటివైపు నడుచుకుంటు వెళ్తుండగా వెనకే వచ్చిన ఇద్దరు దుండగులు...

సాక్షి, పలాస/శ్రీకాకుళం: జిల్లాలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలోని గోల్డ్‌ చైన్‌ను బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. వివరాలు.. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని రోటరీనగర్‌కు చెందిన ఉషారాణి శుక్రవారం సాయత్రం తమ ఇంటివైపు నడుచుకుంటు వెళ్తుండగా వెనకే వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని బైక్‌పై పరారయ్యారు. దొంగతనం అడ్డుకునే క్రమంలో ఉషారాణికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ సీసీటీవీలో నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్నామనీ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement