ముహూర్త సమయానికి వధువు పరార్‌

Bride Escape Marriage Time In Tamil Nadu - Sakshi

అన్నానగర్‌: ఆత్తూర్‌లో సోమవారం వివాహము హూర్త సమయానికి పెళ్లికూతురు పరారైంది. దీంతో వరుడికి మరో యువతితో వివాహం జరిగింది. సేలం జిల్లా ఆత్తూర్‌ ముల్‌లైవాడికి చెందిన యువకుడు సుంగచావడిలో పనిచేస్తున్నాడు. ఇతనికి, పెత్తనాయక్కన్‌ పాళయం చిన్నమ్మ సముద్రంకు చెందిన యువతితో వివాహం నిశ్చయించారు. యువతి ఎమ్‌ఎస్‌సీ చదువుతోంది. ఆత్తూర్‌లో ఓ ఆలయంలో సోమవారం ఉదయం ఆరు గంటలకు పెళ్లి, రిసెప్షన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సోమవారం వేకువజామున వధువు తరఫు వారు వివాహ మండపానికి వచ్చారు. ఆ సమయంలో వధువు కనిపించలేదు. దీనిపై ఆత్తూర్‌ పోలీసు స్టేషన్‌కి సమాచారం అందించారు. తరువాత వాళప్పాడి ప్రాంతానికి చెందిన బంధువు కుమార్తెతో వరుడికి వివాహం జరిపించేందుకు పెద్దలు చర్చలు జరిపారు. అనంతరం యువతిని అలంకరించి వివాహం జరిపించారు. ఆత్తూర్‌ పోలీసుల విచారణలో, వివాహం నిశ్చయమైన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించి అతనితో వెళ్లినట్టు తెలిసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top