అక్రమంగా తరలిస్తున్న అలుగు స్వాధీనం

Animal Smuggling in East Godavari - Sakshi

తూర్పుగోదావరి, వీఆర్‌పురం (రంపచోడవరం): అక్రమంగా తరలిస్తున్న అలుగును అటవీశాఖాధికారులు దాడి చేసి స్వాధీనపరచుకొని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మండల పరిధి పాతరాజుపేటలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకొంది. రేంజర్‌ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. పాతరాజుపేట గ్రామంలోని ఒక ప్రదేశంలో అడవి అలుగును దాచి ఉంచారన్న సమాచారం తెలుసుకున్న రేంజర్‌ సిబ్బందితో దాడి చేశారు.

దీంతో అక్కడున్న నలుగురు దుండగులు ఫారెస్ట్‌ అధికారులు రావడాన్ని పసిగట్టి అలుగును వదిలేసి ఆ ప్రదేశం నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. సిబ్బంది వారిని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేయగా అందులో ముగ్గురు దొరకగా మరో వ్యక్తి పరారయ్యాడు. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని రేంజర్‌ చెప్పారు. వాలుగను విశాఖ అటవీ ప్రాంతం నుంచి తీసుకువచ్చినట్టు పొంతనలేని సమాధానాలను నిందితులు చెబుతున్నారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉందన్నారు. ఈ దాడిలో డీఆర్‌ఓ వీరన్నరాజు, ఎఫ్‌ఎస్‌ఓలు జి.భిక్షం, టి.సాయి, దేశయ్య,ఆరీఫ్‌ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top