breaking news
alugulu
-
అంతరించిపోతున్నఅరుదైన జంతువు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అరుదైన జంతువు అలుగు (పంగోలిన్) ప్రమాదంలో పడింది. సంప్రదాయ వైద్యం, పలు ఉత్పత్తుల్లో వాడకం పేరుతో ఈ వన్యప్రాణిని వేటగాళ్లు హత మార్చుతుండడంతో అంతరించపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ములుగు, ఏటూరు నాగారం, అమ్రాబాద్ టైగర్ రిజర్వుతో సహా పలు అటవీ ప్రాంతాల్లో గుట్టుగా వేటాడుతూ.. డిమాండ్ ఉన్న ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. వైల్డ్ లైఫ్ ట్రస్టు ఆఫ్ ఇండియా (డబ్ల్యూటీఐ) సంస్థ, అటవీ అధికారులు తెలంగాణలో పలుచోట్ల రహస్యంగా మాటు వేసి నిందితులను పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా అలుగులనే అత్యధికంగా వేటాడి అక్రమరవాణా చేస్తుండగా.. వీటి సంఖ్య క్రమంగా క్షీణిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ చర్యల్లో భాగంగా ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) ఈ వన్యప్రాణిని అంతరించిపోతున్న జాతుల్లో చేర్చింది.వైవిధ్యం గల జీవిశరీరంపై గట్టి పొలుసులు ఉండే అలుగు.. క్షీరదాల్లో ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది. ఆకారంలో ముంగిస తరహాలో ఉంటుంది. ఎదురుగా ఏదైనా కనిపిస్తే వెంటనే బంతి ఆకారంలో ముడుచుకు పోతుంది. సిగ్గరిగా, మనుషులకు దూరంగా ఉంటుంది. ఎవరిపైనా ఎటువంటి దాడి చేయదు. కేవలం రాత్రి వేళ సంచరిస్తూ చెదలు, చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటుంది. వాసన, వినికిడి శక్తి అధికంగా ఉంటుంది.శాస్త్రీయంగా నిరూపణ లేకున్నాచైనాతో సహా పలు దేశాల్లో ఈ జీవి శరీర భాగాలను సంప్రదాయ వైద్యంలో అనేక చికిత్సలకు వాడుతున్నారు. దీంతో అక్రమంగా అడవుల నుంచి రవాణా చేస్తూ పొలుసులు, మాంసాన్ని తరలిస్తున్నారు. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా చాలామంది నాటు వైద్యులు.. ఈ జీవి శరీర భాగాలను మందులు, చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం అటవీ సమీప ప్రాంతాల వారికి డబ్బు ఆశ చూపిస్తూ.. అలుగును అక్రమ రవాణా చేస్తున్నారు. కొన్నిసార్లు మధ్యవర్తులతో ఇతర దేశాలకు రవాణా జరుగుతోంది. పలు చికిత్సల్లో వాడుతున్నప్పటికీ రోగ నివారణపై శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాల్లేవని అటవీ, వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మానవ స్వార్థం కోసం అరుదైన అడవి జంతువులను వేటాడొద్దని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ వన్యప్రాణుల సంఖ్య తగ్గి పోయిందని.. భవిష్యత్లో మరింత ముప్పును ఎదుర్కోబోతున్నాయని హెచ్చరిస్తున్నారు.ఆగని అక్రమ రవాణాగత మార్చిలో అలుగును వేటాడుతూ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట రేంజీలో ముగ్గురు పట్టుబడ్డారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో పలు చోట్ల అలుగు అక్రమ రవాణా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఏటూరునాగారం, మంచిర్యాల, కాగజ్నగర్ ప్రాంతాల్లో అలుగును అక్రమంగా తరలిస్తున్న ముఠాలు అటవీ అధికారులకు చిక్కాయి. -
అభయారణ్యంలో అలుగుల వేట
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీలోని పాపికొండల అభయారణ్యంలో అరుదైన వన్యప్రాణులు అలుగులు సంచరిస్తున్నాయి. వీటిని పాంగోలియన్ అని కూడా పిలుస్తారు. వీటి మూతి ముంగీసను పోలి ఉంటుంది. వీటి జీవితకాలం సుమారు 20 ఏళ్లు. చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. ఈ జీవికి పొడవైన నాలుక ఉంటుంది. వీటి చర్మంపై ఉండే పెంకులు (పొలుసులు) దృఢంగా ఉంటాయి. అరుదైన ఈ వన్యప్రాణులు పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 20 వరకూ సంచరిస్తున్నట్లు వైల్డ్ లైఫ్ అధికారులు చెప్పారు. అలుగులు రాత్రి సమయంలోనే ఆహారం కోసం ఎక్కువగా సంచరిస్తుంటాయి. పగటిపూట గోతుల్లో, తొర్రల్లో, చెట్ల పైన దాగి ఉంటాయి. ఇవి సంచరిస్తున్న సమయంలో ఎటువంటి అలికిడి వచ్చినా బెదిరిపోయి బంతిలాగా ముడుచుకుపోతాయి. వీటి వీపుపై ఉండే పెంకులు కత్తిలాగా పదును తేలి గట్టిగా ఉంటాయి. అలుగులపై వేటగాళ్ల కన్ను అభయారణ్యంలో సంచరిస్తున్న అలుగులపై వేటగాళ్ల కన్ను పడింది. అలుగు జంతువు వీపుపై ఉండే పెంకులకు మంచి డిమాండ్ ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అలుగు పెంకులను చైనాలో మెడిసిన్ తయారీకి ఉపయోగిస్తారని చెప్తున్నారు. దీంతో అటవీప్రాంతంలో కూడా అలుగుల కోసం వేట సాగిస్తున్నట్లు సమాచారం. ఇటీవల బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు అలుగును పట్టుకుని రూ.20 లక్షలకు విక్రయిస్తామని ఫేస్బుక్లో అలుగు వీడియోను అప్లోడ్ చేశారు. దీనిపై అధికారులు స్పందించి అలుగును అమ్మకానికి పెట్టిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అరుదైన వన్య ప్రాణులను పట్టుకుని విక్రయించాలని చూస్తే చట్ట ప్రకారం ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని, రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా కూడా విధిస్తారని వైల్డ్ లైఫ్ అధికారులు పేర్కొన్నారు. వన్యప్రాణులను వేటాడితే శిక్షిస్తాం చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు తప్పవు. ముఖ్యంగా పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సంచరిస్తున్న అలుగుల వేట కోసం బయట ప్రాంతాల నుంచి స్మగ్లర్లు వస్తున్నట్లు గుర్తించి నిఘా పెట్టాం. ఇటీవల ఇద్దరు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేశాం. అలుగులను వేటాడితే 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. – జి.వేణుగోపాల్, వైల్డ్లైఫ్ డిప్యూటీ రేంజ్ అధికారి, పోలవరం -
కేబీఆర్ పార్కులో ‘అలుగు’
-
కేబీఆర్ పార్కులో ‘అలుగు’
బంజారాహిల్స్: బంజారాహిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కులో అరుదైన జంతువులు అటు సందర్శకులు.. ఇటు వాకర్లకు కనువిందు చేస్తున్నాయి. కొన్ని జంతువులు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంటాయనడం అతిశయోక్తికాదు. ఆ కోవలోకే వస్తుంది అలుగు. చూస్తూనే చిన్న డైనోసార్ గుర్తుకొచ్చేలా ఉన్న తొండజాతికి చెందిన జంతువు అలుగు. దీని ముక్కు సూటిగా పొడవుగా ఉండి చీడ పురుగులు, చీమలను మాత్రమే తింటుంది. పొలుసుల్లా.. రాయిని పోలినట్లు మందంగా దీని చర్మం ఉంటుంది. ఈ జంతువు ఎవరికీ హాని తలపెట్టదని.. చాలా అరుదుగా కనిపిస్తుంటుందని పార్కు వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా వాక్ వేలో మెల్లగా వెళ్తున్న ఈ జంతువును వాకర్లు తమ కెమెరాల్లో బంధించారు. -
అక్రమంగా తరలిస్తున్న అలుగు స్వాధీనం
తూర్పుగోదావరి, వీఆర్పురం (రంపచోడవరం): అక్రమంగా తరలిస్తున్న అలుగును అటవీశాఖాధికారులు దాడి చేసి స్వాధీనపరచుకొని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మండల పరిధి పాతరాజుపేటలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకొంది. రేంజర్ శ్రీనివాస్రెడ్డి కథనం ప్రకారం.. పాతరాజుపేట గ్రామంలోని ఒక ప్రదేశంలో అడవి అలుగును దాచి ఉంచారన్న సమాచారం తెలుసుకున్న రేంజర్ సిబ్బందితో దాడి చేశారు. దీంతో అక్కడున్న నలుగురు దుండగులు ఫారెస్ట్ అధికారులు రావడాన్ని పసిగట్టి అలుగును వదిలేసి ఆ ప్రదేశం నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. సిబ్బంది వారిని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేయగా అందులో ముగ్గురు దొరకగా మరో వ్యక్తి పరారయ్యాడు. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని రేంజర్ చెప్పారు. వాలుగను విశాఖ అటవీ ప్రాంతం నుంచి తీసుకువచ్చినట్టు పొంతనలేని సమాధానాలను నిందితులు చెబుతున్నారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉందన్నారు. ఈ దాడిలో డీఆర్ఓ వీరన్నరాజు, ఎఫ్ఎస్ఓలు జి.భిక్షం, టి.సాయి, దేశయ్య,ఆరీఫ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
వేటగాళ్ల ఉచ్చులో ఆలుగులు
మన్యంలో విసృ్తతంగా వేట బలైపోతున్న వన్యప్రాణులు గూడెంకొత్తవీధి, న్యూస్లైన్ : అడవుల్లో కనిపించే అరుదైన ఆలుగులు వేటగాళ్ల ఉచ్చులకు చిక్కుతున్నాయి. ఆలుగు వీపుపై ఉండే పెంకుల్లాంటి చిప్పలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు ఆలుగుల వేటకు గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు. శరీరంపైన గట్టిగా పొలుసుల మాదిరిగా ఉంటాయి. కిలో చిప్పలకు రూ.3-4 వేలు ధర పలుకుతుంది. ఇదే అంతర్జాతీయ మార్కెట్లో రూ.25 వేల వరకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఇవి పగలంతా నేలలో బొరియల్లో నివసిస్తూ రాత్రి సమయాల్లోఆహారం కోసం బయటికి వస్తుంటాయి. ఇవి సొంతంగా బొరియలు తయారు చేసుకుని వాటిలో నివాసం ఉంటాయి. అయితే ఈ బొరియలను బట్టి వాని నివాసాలను గిరిజనులు గుర్తించి వేటాడుతున్నారు. ఆ బొరియల్లో మంటలు పెడతారు. ఈ పొగకు తాళలేక అవి బయటకురాగానే పట్టుకుంటారు. అంతేకాకుండా బొరియల వద్ద ఉచ్చులు అమర్చడం ద్వారా సైతం వాటిని పట్టుకుంటారు. ఒక్కో ఆలుగుపై 3-5 కిలోల చిప్పలు లభ్యమవుతాయి. ఈ ఆలుగుకు అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా లక్ష వరకూ ధర ఉంటుందని తెలుస్తోంది. దీంతో స్మగ్లర్లు వాటి కోసం గిరిజనులను మచ్చిక చేసుకుంటున్నారు. అంతరించిపోతున్న ఈ అరుదైన జీవుతను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.