స్కూల్‌ మానేసిన అబ్బాయిలు పెద్ద నేరం

 20 year old gang raped by 5 teens in Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారాల సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఓ యువతిపై ముగ్గురు యువకులు లైంగిక దాడి జరిగిన ఘటన మరువకముందే జహంగిపురి ప్రాంతంలో మరో మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఐదుగురు జువెనైల్స్‌ కలిసి ఓ మహిళను బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి తెలిసినవాళ్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఎవరికైనా చెబితే చంపేస్తాం అని బెదిరించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..

ఓ ఐదుగురు జువెనైల్స్‌ జహంగిరి ప్రాంతంలోని మున్సిపల్‌ చెత్త డంపింగ్‌ యార్డ్‌ వద్ద భవనం వెనుకకు ఆమెను రాత్రి 10గంటల ప్రాంతంలో బలవంతంగా తీసుకెళ్లారు. ఆమె అరిచే ప్రయత్నం చేసినా గొంతు నొక్కిపట్లి అరిస్తే చంపేస్తామని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి కేసు నమోదు చేశారు. ఈ ఐదుగురు కూడా బాధితురాలు ఉండే ప్రాంతంలో ఉండేవారేనని, మధ్యలోనే స్కూల్‌ మానేసిన వీరు చెత్త డంపింగ్‌ యార్డ్‌లో పనులు చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. వారు బాల నేరస్తులు కాకుంటే కోర్టుకు తీసుకెళతామని చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top