
సాక్షి, న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్ కార్ల సంస్థ తన కార్ల ధరలను పెంచేసింది. దేశవ్యాప్తంగా తమ అన్ని మోడళ్లపై వాహనాల ధరలు 4 శాతం పెంచినట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పెంపు జనవరి 1, 2019 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
ఉత్పత్తి ఖర్చుల నిరంతర ఒత్తిడి నేపథ్యంలో ఈ సారి సమీక్షలో ధరలను పెంచాలని నిర్ణయించామని టయోటా తెలిపింది. రూపాయి విలువ క్షీణత ప్రధానంగా వాహనాల తయారీ ధరపై ప్రభావం చూపించిందని చెప్పింది.
హ్యాచ్బ్యాక్ లివా నుంచి లగ్జరీ ఎస్యూవీ ల్యాండ్ క్రూయిజ్ వరకు వివిధ మోడళ్ల కార్లను టయోటా విక్రయిస్తుంది. ముఖ్యంగా యారిస్, ఇటియోస్ తదితర 12 మోడళ్ల వాహనాలను విక్రయిస్తుంది. వీటి ధరలు రూ 5.25 లక్షలు- 1.41 రూపాయల మధ్య ఉన్నాయి.