నికర లాభం రూ.921 కోట్లు
గతంతో పోలిస్తే 4 రెట్ల పెరుగుదల
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ టర్న్ అరౌండ్ అయ్యింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది జూన్ క్వార్టర్లో రూ. 3,183 కోట్ల భారీ నష్టాన్ని ప్రకటించిన టాటా స్టీల్, తాజా త్రైమాసికంలో రూ. 921.09 కోట్ల నికరలాభాన్ని కనపర్చింది. కంపెనీ మొత్తం ఆదాయం 19 శాతం వృద్ధిచెంది రూ. 25,970 కోట్ల నుంచి రూ. 30,973 కోట్లకు చేరింది. అయితే గతేడాది ఏప్రిల్–జూన్ మధ్యకాలంలో కంపెనీ యూరప్లో కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేసిన పనితీరును పరిగణనలోకి తీసుకుని భారీ నష్టాన్ని వెల్లడించగా, కొనసాగించిన కార్యకలాపాల ప్రకారం మాత్రం అప్పట్లో రూ. 209 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది.
ఈ లాభాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే (కొనసాగిన కార్యకలాపాల ప్రకారం) 2017 జూన్ క్వార్టర్లో కంపెనీ నికరలాభం రూ. 209 కోట్ల నుంచి నాలుగింతలై రూ. 933 కోట్లకు చేరింది. ఇండియాలోనూ, యూరప్లోనూ తమ ఉక్కు వ్యాపారం పటిష్టమైన పనితీరును కనపర్చిందని, ఆగ్నేయాసియాలో మాత్రం కార్యకలాపాలు దెబ్బతిన్నట్లు కంపెనీ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. ఆగ్నేయాసియాలో మైనింగ్ లిటిగేషన్ల కోసం రూ. 617 కోట్లు కేటాయింపులు జరిపామని, దీనిని మినహాయిస్తే తమ నికరలాభం రూ. 1,550 కోట్లకు చేరినట్లవుతుందని కంపెనీ వివరించింది.
ఇండియాలో....
ఇండియాలో కళింగనగర్ ప్లాంటు విస్తరణతో తమ ప్లాంట్ల నుంచి 27.5 లక్షల టన్నుల ఉక్కు సరఫరా జరిగిందని, ఇది గతేడాది జూన్ క్వార్టర్తో పోలిస్తే 28 శాతం అధికమని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్తో పోలిస్తే సరఫరాలు 14 శాతం తగ్గాయని, ఇందుకు సీజన్, జీఎస్టీ కారణమని కంపెనీ తెలిపింది. ఇండియా కార్యకలాపాల ద్వారా ఆపరేటింగ్ లాభం 2016 జూన్ క్వార్టర్కంటే 31 శాతం పెరుగుదలతో రూ. 2,922 కోట్లకు చేరింది. కానీ నికరలాభం 12 శాతం క్షీణించి రూ. 506 కోట్లకు తగ్గింది.
యూరప్లో....
యూరప్లో మార్కెట్ పరిస్థితులు మెరుగుపడుతున్నందున, అక్కడి కార్యకలాపాల ఆదాయం 28 శాతం వృద్ధితో 170.3 కోట్ల పౌండ్లకు పెరిగినట్లు టాటా స్టీల్ వెల్లడించింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడగా... సోమవారం టాటా స్టీల్ షేరు ధర బీఎస్ఈలో 4.26 శాతం పెరుగుదలతో రూ. 600 వద్ద ముగిసింది.
టాటా స్టీల్ టర్న్ అరౌండ్
Published Tue, Aug 8 2017 1:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కలెక్టర్ ఆదేశాలు కూడా పనిచేయలేదు
మాజీ సైనికులు ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఓటర్ స్లిప్పు లేదా.. టెన్షన్ వద్దు
ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందాం
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై దుష్ప్రచారం
టీడీపీలో చేరిన నేతను నిలదీసిన గ్రామస్తులు
No Headline
మేమంతా జగనన్న బాటలోనే..
గుట్టుచప్పడు కాకుండా ‘గోకులం’ డ్రామా
గోదావరి వరదల సమయంలోను..
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement