లాభనష్టాల మధ్య ఊగిసలాట

Sensex Jumps Over 200 Points As Banking Stocks Rise - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభనష్టాల మధ్య తీవ్ర  ఊగిసలాటకు గురవుతున్నాయి.  ఒక దశలో 200పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 81 పాయింట్ల లాభాలకు పరిమితమైంది. అటు నిఫ్టీ కూడా 19 లాభంతో 10700  స్థాయిని కూడా కోల్పోయి 10691 వద్ద ఉంది.  అయితే పీఎస్‌యూ,ప్రయివేటు   బ్యాంకింగ్‌ రంగ షేర్ల లాభాలు మార్కెట్లకు బలానిస్తున్నాయి. బ్యాంక్స్‌, రియల్టీ, ఫార్మా, ఆటో స్వల్పంగా లాభపడుతోంది. ఐటీ మాత్రం  నష్టపోతోంది.

ఎయిర్‌టెల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, యాక్సిస్‌, బీపీసీఎల్‌, యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐబీ హౌసింగ్‌ లాభాల్లోనూ హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్, హీరోమోటో, అల్ట్రాటెక్, విప్రో, హెచ్‌యూఎల్‌ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top