రిలయన్స్‌కు డీల్‌ అనిశ్చితి సెగ

Reliance Industries Ltd Slides - Sakshi

సాక్షి,ముంబై : ఇంధన దిగ్గజ సంస్థలు సౌదీ అరామ్‌కో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) మధ్య జరిగిన మెగా డీల్‌కు బ్రేక్‌ పడనుందన్న వార్తలతో ఆర్‌ఐఎల్‌ స్టాక్‌మార్కెట్లో డీలా పడింది. 15 బిలియన్‌ డాలర్ల విలువైన ఈ డీల్‌పై అనిశ్చితి నెలకొనడంతో సోమవారం నాటి  ట్రేడింగ్‌ లో ఆర్‌ఐఎల్‌ షేరు 3 శాతానికి పైగా నష్టపోయింది. పన్నా ముక్తా తపతి చమురు గ్యాస్‌ క్షేత్రాల నుంచి ఆర్జించిన లాభాలలో 350 కోట్ల డాలర్ల(రూ. 24500 కోట్లు)ను మధ్యవర్తిత్వ బకాయిలను చెల్లించాల్సింది ఉందనీ,  ఈ బకాయిలను చెల్లించకముందే చమురు, కెమికల్స్‌ బిజినెస్‌లో 20 శాతం వాటాను సౌదీ అరామ్‌కో కంపెనీకి రిలయన్స్‌ విక్రయిం‍చినట్లు ప్రభుత్వం వివరించింది.  ఈ ఒప్పందాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కేంద్రం పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే తాము బకాయిలు చెల్లించవలసిన అవసరంలేదంటూ ఆర్‌ఐఎల్‌ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు రిలయన్స్‌ కౌంటర్లో అమ్మకాలకు ఎగబడ్డారు.  రిలయన్స్‌తోపాటు  పెట్రో నెట్‌ ఎనర్జీ, గోవా కార్బన్‌  లాంటి ఎనర్జీ షేర్లు కూడా నష్టపోవడం గమనార్హం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top