* ఎకానమీని పరుగెత్తించే సత్తా పోస్టల్ శాఖకు ఉంది...
* ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రైల్వేస్ తరహాలోనే భారీ స్థాయిలో విస్తరించిన పోస్టల్ వ్యవస్థ దేశ ఎకానమీకి చోదక శక్తిగా నిలవగలదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు కూడా ప్రభుత్వ సేవలు, సమాచారం అందేలా చూసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోస్టాఫీసులు ఎంతగానో ఉపయోగపడగలవని ఆయన బుధవారం తెలిపారు.
పోస్టల్ విభాగానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉన్న వనరులు, ఆస్తులను ప్రజోపయోగకర పనులకు ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పోస్టల్ నెట్వర్క్ను మరింత సమర్థంగా వినియోగించుకునే అంశంపై టాస్క్ఫోర్స్ నివేదిక సమర్పించిన సందర్భంగా మోదీ ఈ విషయాలు చెప్పారు. ఇందులో భాగంగా టాస్క్ఫోర్స్ సిఫార్సులను సత్వరం అధ్యయనం చేసి, అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర కమ్యూనికేషన్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సమక్షంలో టాస్క్ఫోర్స్ చైర్మన్ టీఎస్ఆర్ సుబ్రమణ్యన్ నివేదికలో ముఖ్యాంశాల గురించి ప్రధానికి వివరించారు.
అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు, ఇతరత్రా సేవలను అందించేందుకు ఇండియా పోస్ట్ను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చన్న అంశంపై మోదీ గతేడాది ఈ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారు. టాస్క్ఫోర్స్ నివేదిక ప్రకారం డిపాజిట్ల విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తర్వాత ఏకంగా రూ. 6 లక్షల కోట్లతో ఇండియా పోస్ట్ రెండో స్థానంలో ఉంది. దాదాపు 1.55 లక్షల సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వనరులను సమర్థంగా ఉపయోగించుకునేందుకు, వివిధ సేవలను అందించేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ కింద హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలని టాస్క్ఫోర్స్ సూచించింది.
హోల్డింగ్ కంపెనీ స్వరూపం ఇలా..
హోల్డింగ్ కంపెనీలో అయిదు విభాగాలు ఉండొచ్చని టాస్క్ఫోర్స్ పేర్కొంది. ఇందులో బ్యాంకింగ్, బీమా, ఈ-కామర్స్ విభాగాలు తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించవచ్చని తెలిపింది. బ్యాంకింగ్ తర్వాత అత్యధికంగా ఈ-కామర్స్ రంగంలో భారీ అవకాశాలు ఉన్నందున పోస్టల్ విభాగం వీటిని అందిపుచ్చుకోవాలని సూచించింది.
ఇక పోస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట ప్రత్యేకంగా మరో సంస్థను నెలకొల్పాలని తెలిపింది. తొలి మూడేళ్లలో జిల్లాకి ఒక శాఖ చొప్పున ఏర్పాటు చేయొచ్చని వివరించింది. దీనికి ప్రభుత్వం ప్రారంభంలో రూ. 500 కోట్లు మూలనిధిని సమకూర్చాలని సూచించింది. తద్వారా అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఇటు పోస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అటు జనధన యోజన కీలక పాత్ర పోషించగలవని తెలిపింది.
పోస్టల్ ద్వారా ప్రభుత్వ సర్వీసులు
Published Thu, Jan 8 2015 1:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సాయిధరమ్ తేజ్పై దాడి జరగలేదు : డీఎస్పీ
తాటిపర్తి ఘటనలో మాజీ ఎమ్మెల్యే వర్మ హస్తం
పొలంలో ధాన్యం రాశుల దగ్ధం
మిత్ర పురుగులతో తెల్లదోమ నివారణ
దంపతులను ఢీకొన్న లారీ
రత్నగిరికి ఉత్సవ శోభ
వాహనాల తనిఖీలో రూ.2.71 కోట్ల పట్టివేత
ట్రిపుల్ ఐటీ.. భవితకు మేటి
రేపటి నుంచి జిల్లా స్థాయి పోస్టల్ బ్యాలెట్
గూగుల్, ఓపెన్ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీ
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement