-
YS Jagan: 4 వసంతాల నవచరిత
ముప్పై ఎనిమిది వేల స్కూళ్లు తమ రూపాన్ని మార్చుకున్నాయి. సకల సదుపాయాలతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారయ్యాయి. గ్రామాల్లో రైతులకు భరోసానిచ్చేందుకు... ఏకంగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. అవినీతికి తావులేని పౌర సేవల్ని ఏ ఊరికి ఆ ఊళ్లోనే అందించడానికి 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు రూపుదిద్దుకున్నాయి. వీటిల్లో కొత్తగా 1.34 లక్షల మంది యువత ప్రభుత్వోద్యోగులుగా చేరారు. ఇక ప్రభుత్వ సేవల్ని ఇంటింటికీ నేరుగా అందించడానికి 2.65 లక్షల మందితో వలంటీర్ల సైన్యం వచ్చింది. వైద్యుల్లేరనే మాటకు తావులేకుండా 10,592 గ్రామ, పట్టణ హెల్త్ క్లినిక్లు సేవలందిస్తున్నాయి. వీటి ఫలితమేంటో తెలుసా..? ► కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారైన ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు ఇష్టంగా వెళుతున్నారు. రుచికరమైన భోజనం.. స్కూళ్లు తెరవకముందే చేతికందే పుస్తకాలు, యూనిఫామ్.. ఇంగ్లీషు విద్య.. ఎడ్యుటెక్ కంటెంట్తో అందే ట్యాబ్లు... ఏపీ పిల్లల్ని ర్యాంకర్లను చేస్తున్నాయి. విత్తనాల కోసం, ఎరువుల కోసం రోడ్డెక్కాల్సిన అవసరం లేకుండా రైతుల్ని ఆర్బీకేలు చేయిపట్టి నడిపిస్తున్నాయి. విత్తు మొదలు పంట విక్రయం దాకా అన్ని సేవలూ అక్కడే. హెల్త్ క్లినిక్లోని ఫ్యామిలీ డాక్టర్... ఊళ్లలో మంచానపడ్డ వారికి ఇంటికెళ్లి చికిత్స చేస్తున్నాడు. గ్రామ సచివాలయాల్లోనే ప్రభుత్వ సేవలన్నీ అందుతున్నాయి. అవ్వాతాతలకు వలంటీర్లు ఠంచనుగా పింఛన్ను తెచ్చి చేతిలో పెడుతున్నారు. ► పేదలకు రేషన్ సరుకులూ ఇంటి ముంగిటకే వస్తున్నాయి. దీనికోసం 9,260 డెలివరీ వ్యాన్లు పనిచేస్తున్నాయి. కాకపోతే... ఇవన్నీ సాధ్యమయింది కేవలం నాలుగేళ్లలో. 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరవాత!!. ► అందుకే ఇప్పుడు ఏపీ ఒక రోల్ మోడల్. సీఎంగా వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థ నుంచి ఆర్బీకే, రేషన్ డోర్డెలివరీ, వలంటీర్ వ్యవస్థ... ఇలా అన్నిటినీ ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. కొన్ని అమలు చేస్తున్నాయి కూడా!. ► ‘నిన్నటికన్నా నేడు బాగుంటే.. అదే అభివృద్ధి. ఊరైనా... మనుషులైనా’ అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విధానం. ఈ సూత్రంతోనే ఆయన ప్రచారానికి విలువివ్వకుండా పని చేస్తూ పోతున్నారు. సొంతింటికి నోచుకోని 31 లక్షల కుటుంబాల్లో... మహిళలకు ‘పట్టా’భిషేకం చేశారాయన. వారికి ఇళ్ల పట్టాలివ్వటమే కాదు. ఇళ్ల నిర్మాణమూ భుజానికెత్తుకున్నారు. చాలా ఇళ్ల నిర్మాణం పూర్తయింది కూడా. ఇక నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో మహిళలకే 50 శాతం కేటాయించేలా ఏకంగా చట్టం చేసి... అమలు చేశారు. తన కేబినెట్లో, ప్రభుత్వ పథవుల్లో మహిళలకు సగభాగమిచ్చి... చేతల మనిషిగా చరిత్ర సృష్టించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి కేబినెట్లోనే 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు (56 శాతం) అవకాశమిచ్చారు. 2022 ఏప్రిల్ 11న మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఈ శాతాన్ని ఏకంగా 70కి పెంచారు. సామాజిక న్యాయానికి చుక్కానిగా నిలిచారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ తన హయాంలో రాజ్యసభకు ఒక్క బీసీనీ పంపకున్నా... జగన్ మాత్రం 8 సీట్లలో సగం బీసీలకే ఇచ్చారు. ఇక స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారిగా భూముల సమగ్ర సర్వేని చేపట్టడమే కాక... రైతుల కుటుంబాల్లో చీకట్లు నింపిన... నిషేధిత జాబితా భూముల సమస్యను సులువుగా పరిష్కరించారు. 3 లక్షల ఎకరాలను ఆ జాబితాను తొలగించారు. చుక్కల భూములు, షరతులు గల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. ఇవన్నీ ఒకెత్తయితే పారిశ్రామికంగా వేసిన అడుగులు మరో ఎత్తు. ఏపీకి సువిశాల తీరప్రాంతం ఉందంటూ గత పాలకుల్లా మాటలకే పరిమితం కాకుండా... కొత్తగా నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ ల్యాండ్లు, మూడు ఎయిర్పోర్టుల నిర్మాణం చేపట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వం. మునుపెన్నడూ ఈ రాష్ట్రంవైపు చూడని... అంబానీ, అదానీ, జిందాల్, బంగూర్, భజాంకా తదితర దిగ్గజాలంతా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ వేదికగా విశ్వాసం వ్యక్తంచేయటమే కాక పెట్టుబడులూ పెడుతున్నారంటే... అది ముఖ్యమంత్రి దార్శనికతపై భరోసాతోనే. అందుకే... గడిచిన నాలుగేళ్లూ ఆంధ్రప్రదేశ్కు కొత్త చరిత్ర. -
ఇంటింటికీ సచివాలయాల ఉద్యోగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వలంటీర్లతో కలిసి ఇంటింటికీ వెళ్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వలంటీర్లతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు వారి సొంత ఊళ్లలోనే ప్రభుత్వం అందజేస్తున్న వివిధ సేవల వివరాలను తెలియజేస్తున్నారు. ఏప్రిల్ ఆఖరి శుక్ర, శనివారాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆధార్ నిబంధనల్లో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే వివిధ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా అన్ని వార్డు సచివాలయాల్లో అందజేస్తున్న సేవల గురించి పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఇంటింటా వివరించి చెప్పాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. -
Grama, ward Sachivalayam: సేవల్లో రికార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ సరికొత్త రికార్డు సృష్టించింది. వీటి ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఈనెల 25న ఒక్క రోజులో ఏకంగా 2.88 లక్షల మంది వినతులు పరిష్కారమయ్యాయి. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2019 అక్టోబరు 2న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. నగరాలు, పట్టణాలు, గ్రామాలు, కుగ్రామాలు అన్న తేడా లేకుండా ప్రజలెవరూ ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పనుల కోసం మండల కేంద్రాలు లేదంటే దగ్గర్లోని పట్టణాలు లేదా జిల్లా కేంద్రాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి సొంత ఊర్లోనే ఆయా పనులయ్యేలా ఓ వినూత్న, విప్లవాత్మక ఆలోచనను ఆచరణలో పెట్టింది. ఈ పనులు దాదాపు పరిష్కారమయ్యేలా 2020 జనవరి 26 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 545 ప్రభుత్వ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో 252 రకాల కేంద్ర ప్రభుత్వ సేవలను కూడా దశల వారీగా అందుబాటులోకి తెచ్చింది. వీటిద్వారా ఇప్పటివరకు గత మూడేళ్లలో 6.43 కోట్ల మంది ప్రభుత్వ సేవలను పొందారు. అయితే, ఇప్పటివరకు ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 1.80 లక్షల సేవలను మాత్రమే అందజేసిన రికార్డు ఉండేది. కానీ, గత బుధవారం ఒక్కరోజే 2.88 లక్షల మంది వివిధ రకాల సేవలను వినియోగించుకున్నారని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. నిజానికి.. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్లో అదేరోజు సాంకేతిక సమస్యలు తలెత్తాయని.. అది లేకుండా ఉంటే సేవల సంఖ్య మరికొంత పెరిగేదని వారు తెలిపారు. 65 శాతానికి పైగా రెవెన్యూ సేవలే.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గత మూడేళ్లల్లో ప్రజలకు అందించిన మొత్తం 6.43 కోట్ల ప్రభుత్వ సేవలు చూసినా.. ఈ నెల 25న పరిష్కరించిన 2.88 లక్షల వినతులను చూసినా.. అందులో 65–70 శాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. మూడేళ్ల క్రితం ఒక రైతు తన సొంత పొలం వివరాలను పాస్ పుస్తకంలోగానీ, రెవెన్యూ శాఖ మీ–భూమి రికార్డులోగానీ నమోదు చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడేవారు. నెలల తరబడి మండలాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పరిష్కారం కాని పరిస్థితి. లంచాల బెడద వీటికి అదనం. కానీ, ఇప్పుడు రెవెన్యూ రికార్డులో భూమి బదిలీకి సంబంధించి జరిగే మ్యూటేషన్ ప్రక్రియ వారి సొంత గ్రామాల్లోని గ్రామ సచివాలయాలోనే అత్యంత సులువుగా, ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులోనే పూర్తిచేసి ఆ సమాచారాన్ని సంబంధిత యజమానికి మెసేజ్ పంపుతున్నారు. వ్యవసాయ భూములకు సంబంధించి ఈసీ జారీ కూడా సచివాలయాల ద్వారానే లభిస్తోంది. అలాగే, ఆదాయ, కుల ధృవీకరణ ప్రతాలు వంటి వాటికి గతంలో 30 రోజుల సమయం పట్టే పరిస్థితి ఉండగా.. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సగటున ఐదు రోజుల వ్యవధిలో సంబంధిత తహసీల్దార్ ఆమోదం పూర్తయి, సర్టిఫికెట్లను కూడా సచివాలయాల్లోనే జారీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ నెల 25న అందజేసిన సేవలలో కూడా రెవెన్యూ సంబంధిత సేవలే ఎక్కువగా ఉన్నాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం జగనన్న చేదోడు పథకం తుది లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నందున ఆ రోజు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారన్నారు. సేవల సంఖ్య, నాణ్యతలో పెరుగుదల ఇక గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు సమయంలో అందుబాటులోకి తీసుకొచ్చిన సేవలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం కాలేదు. ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు తగ్గట్లుగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే, సేవల నాణ్యత పెంచడానికి కూడా అనేక చర్యలు చేపట్టింది. ఉదా.. ► ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారుల ఆధార్ వివరాలతో అనుసంధానం చేసి అమలుచేస్తుండడంతో ప్రభుత్వం కొత్తగా సచివాలయాల్లో ఆధార్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ► రాష్ట్రంలోని ప్రతి ఐదు గ్రామ సచివాలయాల్లో ఒకచోట చొప్పున 2,377 సచివాలయాల్లో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఇప్పటిదాకా ఆధార్ సేవలు లేని ప్రాంతాలను గుర్తించి ఆయా సచివాలయాల్లోనే ముందుగా వీటిని ఏర్పాటుచేశారు. ► అలాగే, ఇళ్లు, భూ క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సేవలను సైతం ప్రభుత్వం సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టింది. 1,537 సచివాలయాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం స్థానిక సిబ్బందికి శిక్షణ కూడా పూర్తిచేసింది. వీటిల్లో 51చోట్ల ఇప్పటికే ఆ సేవలు ప్రారంభయ్యాయి. ► గత ఏడాది కాలంలో కొత్తగా మున్సిపల్ ప్రాంతాలకు సంబంధించి నీటి, ఆస్తిపన్నులు, ట్రాఫిక్ చలానాలు, రైతుల నీటి తీరువా బిల్లుల చెల్లింపులనూ ప్రభుత్వం సచివాలయాల పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రజల డబ్బు, సమయం ఎంతో ఆదా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు నాంది పలికిన తర్వాత ప్రభుత్వంతో ఏ చిన్న పనిపడినా రోజుల తరబడి పట్టణ, మండల, జిల్లా కేంద్రాల్లోని ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా ప్రజల డబ్బు, సమయం ఎంతో ఆదా అవుతోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పారదర్శకత పెరిగి లంచాలకు తావులేకుండా పోయింది. రాబోయే రోజుల్లో సచివాలయాల్లో మరిన్ని కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. – బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) జిల్లాకొక సాఫ్ట్వేర్ నిపుణుడు సచివాలయాల్లో వినతుల పరిష్కారంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఎప్పటికప్పుడే వాటిని పరిష్కరించడానికి జిల్లాకొక సాఫ్ట్వేర్ నిపుణుడిని ఏర్పాటుచేస్తోంది. అలాగే, సేవలు అందజేసే సమయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన శిక్షణనూ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. రాబోయే రోజుల్లో ఇంటినుంచే ఆన్లైన్ ద్వారా సచివాలయ సేవలను అందించేందుకు కసరత్తు చేస్తోంది. దరఖాస్తుదారులకు సంబంధిత సర్టిఫికెట్ల సాఫ్ట్ కాపీలను వాట్సాప్ లింక్ ద్వారా పంపేందుకు యత్నిస్తున్నారు. -
సచివాలయాల సేవలూ ఇంటి వద్దకే!
సాక్షి, అమరావతి: ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో సినిమా, బస్, రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్నట్టే.. గ్రామ, వార్డు సచివాలయాల సేవలు కూడా ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రజలు ఇంటి వద్దనే ఉండి దరఖాస్తు చేసుకునేలా గ్రామ, వార్డు సచివాలయాల వెబ్సైట్ను తీర్చిదిద్దుతోంది. దీని ద్వారా ప్రభుత్వం సచివాలయాల్లో అందజేస్తున్న 545 రకాల ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటకే వస్తాయి. ఇంట్లో ఇంటర్నెట్తో కూడిన స్మార్ట్ఫోన్/ల్యాప్టాప్/డెస్క్టాప్ ఉంటే చాలు.. ఎవరైనా తమ వ్యక్తిగత మెయిల్ ఐడీల ద్వారా 545 రకాల ప్రభుత్వ సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటి వద్దే ధ్రువీకరణ పత్రాలు పొందే వీలు.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పాలనలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. దీంతో ప్రజలు తమ సొంత గ్రామం దాటి వేరే ఊరు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సొంత ఊరిలోనే 545 రకాల ప్రభుత్వ సేవలను పొందుతున్నారు. ప్రతి నెలా పంపిణీ చేసే పింఛన్లు, రేషన్ వంటివాటిని ఇప్పటికే వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల వద్దకే ప్రభుత్వం చేరవేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు ప్రభుత్వ సేవలు పొందడానికి సచివాలయానికి కూడా వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్లనుంది. ఈ క్రమంలో ఎవరైనా ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ ద్వారా సచివాలయాల సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులు నేరుగా ఆయా శాఖల సిబ్బందికి చేరతాయి. వాటి ఆమోదం అనంతరం తిరిగి మెయిల్ ఐడీ ద్వారా ఆ సేవలకు సంబంధించిన సర్టిఫికెట్లను ఇంటి వద్దనే పొందే వీలుంటుందని అధికారులు వెల్లడించారు. -
భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తికావాలి
గుంటూరు వెస్ట్: ప్రజలకు బహుళ ప్రయోజనాలు కలిగించి ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసే ప్రాధాన్యతా భవనాల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల రెడ్డి తెలిపా రు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ గత కొంత కాలంగా నిర్మాణంలో ఉన్న సచివాలయాలు, విలేజ్ వెల్నెస్ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, ఆర్బీకేలు, బీఎంసీయులు నిర్మాణాల్లోని ఇబ్బందులుంటే వెంటనే పరిష్కరిస్తానన్నా రు. నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చని భవనాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. అధికారులు వివరాలను కలెక్టర్కు అందిస్తూ 154 ఆర్బీకేలకుగాను 43 పూర్తి చేశామన్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు 164కుగాను 47, గ్రామ సచివాలయాలు 206కు గాను 110, 25 బీఎంసీయూలకు గాను 2, డిజిటల్ లైబ్రరీలు 92కు గాను 49 పూర్తి చేశామని చెప్పారు. ఈ ఏడాది ముగింపు నాటికి మొత్తం భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. సమావేశంలో పంచాయతీ రాజ్ ఎస్ఈ బ్రహ్మయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరచండి పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న జగనన్న లే అవుట్స్లో నిర్మాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల వర్షాల కారణంగా నిర్మాణాల్లో కొంత ఆలస్యమేర్పడిందన్నారు. తొలి దశలో మంజూరైన 68,989 ఇళ్ల నిర్మాణాలను అధికారులు వేగంగా పూర్తిచేయాలన్నారు. ఇందులో 42,821 ఇళ్లు బీబీఎల్, 12,394 ఇళ్లు బేస్మెంట్ లెవెల్, 1200 గృహాలు రూప్ లెవెల్, 2430 ఇళ్లు ఆర్సీ లెవెల్స్లో ఉన్నాయన్నారు. కాలనీలకు అప్రోచ్ రోడ్లు, లెవెలింగ్ పనులు పూర్తి చేసేందుకు అధికారులు మరింత చొరవ చూపాలన్నారు. అక్టోబర్ చివరి నాటికి మిగతాఇళ్ల బేస్మెంట్ పూర్తి చేయాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన నీరు, విద్యుత్లు నిరంతరాయంగా అందించాలన్నారు. అక్టోబర్ 2 నాటికి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసే విధంగా చూడాలన్నారు. సమావేశంలో జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి, మెప్మా పీడీలు హరిహరనాథ్, వెంకట నారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యాలు పెంచుకోండి ప్రతి వృత్తిలో సాంకేతికత పెరుగుతోందని దాంట్లో నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి మార్గాలు మెరుగుపరచుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్కిల్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గానికి ఒక హబ్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తొలి దశలో గుంటూరు ఐటీఐ, పొన్నూరులోని చేబ్రోలు ప్రభు త్వ కళాశాలలో, తెనాలిలోని ఐటీఐ కళాశాలలో హబ్ను ప్రారంభించి శిక్షణ ప్రారంభిస్తారన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సీడ్యాప్, ఎన్ఏసీ, ఆర్ఎస్టీఐ, జన శిక్షణా సంస్థలు ఎవరికి వారు నిరుద్యోగులకు శిక్షణ నిచ్చేవారన్నారు. ఇక నుంచి స్కిల్ హబ్లలో కమిటీల ద్వారా అవసరమైన శిక్షణనిస్తారన్నారు. జాతీయస్థాయి పరిశ్రమలు, జిల్లాలో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా నిరుద్యోగులను స్కిల్డ్ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాల సహకారంతో వెబ్, యాప్ డిజైనింగ్, సెక్యూరిటీ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, సోలార్ ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్, ఎలక్ట్రిక్, ప్లంబరింగ్ తదితర అంశాల్లో శిక్షణనిచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ హరిహరనా«థ్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రణయ్, పరిశ్రమల శాఖ జీఎం సుధాకరరావు, అధికారులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement