రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఎన్‌ఎస్‌ఈ ‘జీ–సెక్‌’ ప్లాట్‌ఫామ్‌ | NSE launches Mobile App & Web platform for retail investors | Sakshi
Sakshi News home page

రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఎన్‌ఎస్‌ఈ ‘జీ–సెక్‌’ ప్లాట్‌ఫామ్‌

Nov 20 2018 1:31 AM | Updated on Nov 20 2018 1:31 AM

NSE launches Mobile App & Web platform for retail investors - Sakshi

ముంబై: రిటైల్‌ ఇన్వెస్టర్లు ప్రభుత్వ సెక్యూరిటీలను సులభంగా కొనుగోలు చేయటానికి వీలుగా ఎన్‌ఎస్‌ఈ వెబ్‌ పోర్టల్‌తో పాటు మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఎన్‌ఎస్‌ఈ గోబిడ్‌’ పేరిట రూపొందించిన ఈ మొబైల్‌ అప్లికేషన్‌ను సెబీ చైర్మన్‌ అజయ్‌త్యాగి సోమవారం ముంబైలో ఆవిష్కరించారు. ట్రెజరీ బిల్లులు 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల కాల వ్యవధి కోసం, ఇతర ప్రభుత్వ బాండ్లలో (ఏడాది నుంచి 40 ఏళ్ల కాల వ్యవధి) ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు ఈ యాప్‌ ఉపకరిస్తుంది.

‘‘దేశంలో డిజిటల్‌ చెల్లింపులు పెరిగిన తరుణంలో ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు ఈ యాప్‌ తీసుకురావడం కీలక మైలురాయిగా భావిస్తున్నాం. నాన్‌ కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసేందుకు సెబీ స్టాక్‌ ఎక్సేంజ్‌లను అనుమతించాకే... ప్రభుత్వ సెక్యూరిటీల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లు పాల్గొనడం ప్రారంభమైంది’’ అని అజయ్‌త్యాగి ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఆఫర్‌ చేసే రాబడుల కంటే ప్రభుత్వ బాండ్లు మెరుగైన రాబడులను ఇస్తున్నట్టు చెప్పారు.

రిటైల్‌ ఇన్వెస్టర్లు ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ సెక్యూరిటీల్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల ప్రాతినిథ్యం ప్రస్తుతం తక్కువగా ఉందని, ఇది పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైతే మెరుగుదలకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్లపై రాబడి 7.80– 7.83 శాతం మధ్య ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement