ఇంటర్నెట్ కస్టమర్ల వాటా పెంపు లక్ష్యం | Internet customers To increase share of Aims | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్ కస్టమర్ల వాటా పెంపు లక్ష్యం

Jul 15 2015 11:59 PM | Updated on Sep 3 2017 5:33 AM

ఇంటర్నెట్ కస్టమర్ల వాటా పెంపు లక్ష్యం

ఇంటర్నెట్ కస్టమర్ల వాటా పెంపు లక్ష్యం

టెలికం కంపెనీ యునినార్‌కు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లలో 24 శాతం మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు...

యునినార్ సర్కిల్ హెడ్ శ్రీనాథ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
టెలికం కంపెనీ యునినార్‌కు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లలో 24 శాతం మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. 2017 నాటికి ఈ సంఖ్యను 50 శాతానికి చేర్చాలని సంస్థ లక్ష్యంగా చేసుకుందని యునినార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం తెలిపారు.  
 
డిజిటల్ విన్నర్స్..: ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు డిజిటల్ విన్నర్స్ పేరుతో ఒక పోటీని (కాంటెస్ట్) యునినార్ ఆవిష్కరించింది. ఎడ్యుకేషన్ ఈ ఏడాది కాంటెస్ట్ థీమ్. సామాజికంగా మార్పును తీసుకొచ్చేలా మొబైల్ యాప్స్‌ను రూపొందించిన డెవలపర్లు పోటీలో పాల్గొనవచ్చు. అందరికీ విద్య అందించడంలో ఉన్న సవాళ్లను కొంతైనా పరిష్కరించే ఐడియాలు ఈ వేదిక ద్వారా వస్తాయని ఎక్స్‌టర్నల్ కమ్యూనికేషన్స్ హెడ్ అనురాగ్ ప్రసాద్ అన్నారు. భారత్ నుంచి ఎంపికైన విజేతలు అక్టోబరులో ఓస్లోలో జరిగే డిజిటల్ విన్నర్స్ సదస్సులో తమ ఐడియాను తెలియజేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. విజేత సుమారు రూ.8 లక్షలు గెల్చుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement