చౌక ధరల్లో విమానటిక్కెట్లను అందించే విమానయానసంస్థ ఇండిగో మూడు రోజుల మాన్ సూన్ స్పెషల్ సేల్ ఆఫర్ తీసుకొచ్చేసింది.

చెన్నై : చౌక ధరల్లో విమానటిక్కెట్లను అందించే విమానయానసంస్థ ఇండిగో మూడు రోజుల మాన్ సూన్ స్పెషల్ సేల్ ఆఫర్ ను తీసుకొచ్చేసింది. ఈ స్పెషల్ సేల్ ఆఫర్ కింద రూ.899కే టిక్కెట్ ధరను విక్రయిస్తోంది. జూన్ 12 నుంచి జూన్ 14 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుందని ఇండిగో తెలిపింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణాలకు ఈ టిక్కెట్లు వర్తిస్తాయని పేర్కొంది. ముంబై-గోవా, జమ్ము-అమృత్ సర్, ఢిల్లీ-ఉదయ్ పూర్, అహ్మదాబాద్-ముంబై, చెన్నై-పోర్టు బ్లయిర్, హైదరాబాద్-ముంబై, కోల్ కత్తా-అగర్తల, ఢిల్లీ-కోయంబత్తూర్, గోవా-చెన్నై వంటి ఎంపికచేసిన మార్గాలకు ఈ టిక్కెట్ ధరలను ఆఫర్ చేయనుంది.