స్వల్పంగా ధర తగ్గిన పసిడి | Gold falls by Rs 70 to Rs 31750 per 10 grams | Sakshi
Sakshi News home page

స్వల్పంగా ధర తగ్గిన పసిడి

Feb 17 2018 5:47 PM | Updated on Jul 11 2019 8:56 PM

Gold falls by Rs 70 to Rs 31750 per 10 grams  - Sakshi

సాక్షి,ముంబై:  బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు  స్వల్పంగా  తగ్గాయి.  అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం,  స్థానికంగా డిమాండ్‌ తగ్గడంతో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.  10 గ్రాముల పసిడి రూ. 70 రూపాయలు తగ్గి రూ. 31,750గా ఉంది. పెళ్లిళ్ల సీజన్‌ కారణంగా పెరిగిన  డిమాండ్‌తో రెండు మూడు రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధర  రూ.31,820 స్థాయికి  ర్యాలీ అయింది. శనివారం మార్కెట్‌ ముగిసే సమయానికి బంగారం స్వల్పంగా తగ్గి,   వెండి ధరలు పుంజుకున్నాయని  బులియన్  మార్కెట్ వర్గాలు తెలిపాయి.  కిలోవెండి రూ. 370 పెరిగి రూ. 39.750గా ఉంది. నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ రావడంతో వెండి ధర పెరిగిందని   పేర్కొన్నాయి.  ఎనిమిది గ్రాముల బంగారం ధర 24,800 రూపాయల వద్ద స్థిరపడింది. కాగా గత రెండు రోజుల్లో  పసిడి ధర  రూ .520 లాభపడింది. ప్రపంచవ్యాప్తంగా బంగారం 0.50 శాతం పడిపోయి 1,346.50 డాలర్లకు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement