ఫార్చ్యూన్ ‘40 అండర్ 40’లో మనోళ్లు నలుగురు.. | four indians are in Fortune 40 under 40 | Sakshi
Sakshi News home page

ఫార్చ్యూన్ ‘40 అండర్ 40’లో మనోళ్లు నలుగురు..

Oct 11 2014 1:08 AM | Updated on Oct 22 2018 5:17 PM

ఫార్చ్యూన్ ‘40 అండర్ 40’లో మనోళ్లు నలుగురు.. - Sakshi

ఫార్చ్యూన్ ‘40 అండర్ 40’లో మనోళ్లు నలుగురు..

ఫార్చ్యూన్ బిజినెస్ మ్యాగజైన్ రూపొందించిన 40 అండర్ 40 జాబితాలో నలుగురు భారతీయులకు చోటు దక్కింది.

న్యూయార్క్: ఫార్చ్యూన్ బిజినెస్ మ్యాగజైన్ రూపొందించిన 40 అండర్ 40 జాబితాలో నలుగురు భారతీయులకు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 40 సంవత్సరాల లోపు వయస్సున్న 40 మంది అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన, ముఖ్యమైన వ్యక్తులతో ఫార్చ్యూన్ ఈ జాబితాను రూపొందించింది. స్నాప్‌డీల్ , మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకులతో పాటు హార్వార్డ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. హార్వార్డ్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ అయిన రాజ్ చెట్టి ఈ జాబితాలో 16 వ స్థానంలో ఉన్నారు. న్యూఢిల్లీలో జన్మించిన ఆ 35 ఏళ్ల రాజ్ చెట్టి 23 ఏళ్లకే హార్వార్డ్ యూనివర్శిటీలో పీ.హెచ్‌డీ చేశారు.

మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ 37 ఏళ్ల రాహుల్ శర్మ ఈ జాబితాలో 21వ స్థానంలో నిలిచారు. స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ 31 సంవత్సరాల వయస్సున్న కునాల్ బహాల్ 25వ ర్యాంక్‌ను సాధించారు, ట్విట్టర్‌కు న్యాయ సలహా దారు, ఆ కంపెనీ ఏకైక మహిళా ఎగ్జిక్యూటివ్ అయిన 39 సంవత్సరాల విజయ గద్దె 28వ స్థానంలో నిలి చారు. కాగా ఈ జాబితాలో రైడ్‌షేరింగ్ సర్వీస్ కంపెనీ యుబెర్ వ్యవస్థాపకుడు ట్రావిస్ కలానిక్, ఆతిథ్య రంగ కంపెనీ ఎయిర్‌బన్‌బ్స్ సీఈఓ బ్రియాన్ చెస్కీలు  మొదటి స్థానంలో  ఉన్నారు. రెండో  స్థానంలో ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement