♦ అంతర్జాతీయ బ్రాండెడ్ దుస్తుల వేదిక
♦ 7,600 స్టోర్లలో 220 బ్రాండ్లతో డీల్
♦ సౌదీ, ఆగ్నేయాసియా దేశాలకు విస్తరణ
♦ రూ.20 కోట్ల నిధుల సమీకరణ పూర్తి
♦ ‘స్టార్టప్ డైరీ’తో ఫైన్డ్ కో–ఫౌండర్ హర్ష్ షా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అలెన్ సోలీ, టామీ హిల్ఫిగర్, అమెరికన్ ఈగల్, పూమా, బీయింగ్ హ్యూమన్, లీ... ఇవన్నీ టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్ అన్న సంగతి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వీటిని ఆన్లైన్లో కొనాలంటే కాస్త ఆలోచిస్తాం. కారణం.. ఆన్లైన్లో బ్రాండెడ్తో పాటూ స్థానిక దుస్తులూ ఉండటమే!! కానీ, బ్రాండెడ్ దుస్తులకు మాత్రమే వేదికగా నిలుస్తోంది ఫైన్డ్. ఒకటి కాదు రెండు కాదు దేశ, విదేశాల్లోని 220 బ్రాండ్ల దుస్తులు లభించడం దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ హర్ష్ షా మాటల్లోనే..
బ్రాండెడ్ ఫ్యాషన్ ఉత్పత్తులను ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతకూ చేరువ చేయాలనే ఉద్దేశంతో గతేడాది జనవరిలో రూ.6 కోట్ల పెట్టుబడులతో ఫారూఖ్ ఆదాం, శ్రీరామన్ ఎంజీతో కలసి ముంబై కేంద్రంగా ఫైన్డ్ (www.gofynd.com)ను ప్రారంభించాం. ప్రస్తుతం దేశంలోని 7,600 స్టోర్లలో 220 బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్నాం. 60 వేల ఉత్పత్తులున్నాయి. త్వరలోనే మరో 140 బ్రాండ్లతో ఒప్పందం చేసుకుంటాం. ప్రస్తుతం మహిళలు, పురుషులకు సంబంధించిన దుస్తులు, పాదరక్షలు, జ్యుయలరీ, యాక్సెసరీలను మాత్రమే విక్రయిస్తున్నాం. మరో 2 నెలల్లో పిల్లల విభాగంలోకీ విస్తరిస్తాం. ఇటీవలే ఇన్–స్టోర్ సేవలను ప్రారంభించాం. ఇదేంటంటే.. ఒప్పందం చేసుకున్న స్టోర్లలోకి వచ్చిన కస్టమర్లకు వారికి నచ్చిన రంగులు, ఫ్యాషన్ ఉత్పత్తులు లేకపోతే వాటిని స్థానికంగా ఉన్న ఇన్–స్టోర్లో నమోదు చేస్తే చాలు. నేరుగా కస్టమర్ల ఇంటికి డెలివరీ చేస్తాం.
రోజుకు 2,500–3,000 ఆర్డర్లు..
ప్రస్తుతం 32 లక్షల మంది కస్టమర్లున్నారు. రోజూ 35–40 వేల మంది యాడ్ అవుతున్నారు. రోజుకు 2,500–3,000 ఆర్డర్లొస్తున్నాయి. కనీస ఆర్డర్ విలువ రూ.1,500. ప్రతి ఆర్డర్పై 20–30 శాతం విక్రయదారుడి నుంచి కమిషన్ తీసుకుంటాం. గతేడాది ఫైన్డ్ ద్వారా రూ.34 కోట్ల అమ్మకాలు జరిగాయి. కమిషన్ రూపంలో రూ.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఆర్డర్లను డెలివరీ చేసేందుకు ఐదు కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. రెండు రోజుల్లో డెలివరీ చేస్తాం.
ఏపీ, తెలంగాణ వాటా 15 శాతం..
ప్రస్తుతం 80 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగిసేలోగా 400 బ్రాండ్లకు, 60 లక్షల కస్టమర్లకు, రూ.90 కోట్ల జీఎంవీకి చేరుకోవాలని లక్ష్యించాం. మా మొత్తం వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 40–45%. అందులో ఏపీ, తెలంగాణ వాటా 15%. ఈ మధ్యే ఐఐఎఫ్ఎల్ సీడ్ వెంచర్స్, కేఏఈ క్యాపిటల్స్ నుంచి రూ.20 కోట్ల నిధులను సమీకరించాం. వీటిని విదేశీ విస్తరణకు ఉపయోగిస్తున్నాం. వచ్చే ఏడాది గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాల్లో సేవలను ప్రారంభిస్తాం.
అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...
ఫైన్డ్.. అన్ని బ్రాండ్లూ ఇక్కడే!
Published Sat, Jul 8 2017 1:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement