కస‍్టమర్లకు షాకిచ్చిన యాక్సిస్‌ బ్యాంక్‌ | Axis Bank ups loan rates by 5 bps to counter margin pressure | Sakshi
Sakshi News home page

కస‍్టమర్లకు షాకిచ్చిన యాక్సిస్‌ బ్యాంక్‌

Jan 18 2018 10:21 AM | Updated on Jan 18 2018 11:02 AM

Axis Bank ups loan rates by 5 bps to counter margin pressure - Sakshi

సాక్షి, ముంబై:  ప్రైవేట్‌ బ్యాంక్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌  షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. మార్జిన్ల బెడదతో  ఇబ్బందులు పడుతున్న బ్యాంకు  రుణాలపై వడ్డీరేటును పెంచేందుకు నిర్ణయించింది. రుణాలపై వసూలు చేసే లెండింగ్‌ రేటుపై 5 బేసిస్ పాయింట్లను పెంచుతూ  నిర్ణయం తీసుకుంది.  ఈ పెంపు జనవరి 18నుంచి అమల్లోకి రానుందని వెల్లడించింది.  దీంతో  బ్యాంకు అందిస్తున్న వార్షిక ఎంసీఎల్ఆర్  8.30 శాతానికి చేరింది.

వార్షిక రుణాలపై 5 బేసిస్ పాయింట్లు పెంచామనీ,  జనవరి 18 నుంచి అమల్లోకి వస్తోందని స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఫైలింగ్‌లో బ్యాంకు తెలిపింది.  అయితే లాకింగ్‌ పీరియడ్‌లో పాత రుణగ్రహీతలకు పాత వడ్డీరేట్లు వర్తిస్తాయని తెలిపింది.  ఈ నిర్ణయం  ప్రభావం కొత్తగా రుణాలను తీసుకునేవారిపై  పడనుంది.  మరోవైపు వడ్డీరేటును  పెంచుతున్న మొట్టమొదటి వాణిజ్య బ్యాంకుగా యాక్సిస్ బ్యాంక్  నిలిచింది.  దీంతో మూడు సంవత్సరాలలో మొదటిసారి వడ్డీ రేటు పెంచడం కొన్ని కీలక సంకేతాలను అందిస్తోందని విశ్లేషకులు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement