ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌

Airtel Rs. 449 Pack Takes on Rs. 448 Jio Recharge With 140GB Data for 70 Day - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  టెలికాం సంస్థ  భారతి ఎయిర్‌టెల్  తన ప్రధాన ప్రత్యర్థి జియోకు పోటీగా సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది.  జియో  448 రూపాయల రీచార్జ్ ప్లాన్‌కు  ధీటుగా  రూ.449 ల  కొత్త  ప్రీపెయిడ్ ప్లాన్‌ను   దేశవ్యాప్తంగా  తన కస‍్టమర్లకు అందుబాటులోకి  తెచ్చింది.  ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2 జీబీ డేటా  వాడుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు.  అంటే మొత్తం 140 జీబీ డేటాను అందిస్తోంది.   దీనితోపాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు  లభిస్తాయి. జియోలో ఇదే తరహాలో రూ.448 ప్లాన్ అందుబాటులో ఉండగా ఆ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 2జీబీ డేటా వస్తుంది. మొత్తం 84 రోజుల వాలిడిటీకి 168 జీబీ డేటా లభిస్తుంది. తాజాగా ఈ ప్లాన్‌కు పోటీగానే ఎయిర్‌టెల్ రూ.449 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top