ఎయిర్‌ ఇండియా విక్రయం.. నిపుణులకోసం కసరత్తు | Air India sales | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ఇండియా విక్రయం.. నిపుణులకోసం కసరత్తు

Aug 8 2017 1:29 AM | Updated on Sep 17 2017 5:16 PM

ఎయిర్‌ ఇండియా విక్రయం.. నిపుణులకోసం కసరత్తు

ఎయిర్‌ ఇండియా విక్రయం.. నిపుణులకోసం కసరత్తు

ఎయిర్‌ ఇండియాలో వాటాలను విక్రయించాలనుకుంటున్న కేంద్ర సర్కారు ఇందుకు సంబంధించి లావాదేవీ సలహాదారులు, న్యాయ సలహాదారులు, ఆస్తుల విలువ మదింపు దారులను ఎంపిక చేసే పనిలో పడింది.

ముంబై: ఎయిర్‌ ఇండియాలో వాటాలను విక్రయించాలనుకుంటున్న కేంద్ర సర్కారు ఇందుకు సంబంధించి లావాదేవీ సలహాదారులు, న్యాయ సలహాదారులు, ఆస్తుల విలువ మదింపు దారులను ఎంపిక చేసే పనిలో పడింది. ఈ దిశగా ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ త్వరలోనే ఆహ్వానం పలకనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఎయిర్‌ ఇండియా, దాని అనుబంధ సంస్థల్లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ జూన్‌ 28న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎటువంటి గడువును పేర్కొనకపోయినప్పటికీ, రానున్న 12–18 నెలల్లో విక్రయాన్ని పూర్తి చేయాలనుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement