సుజనా.. నోరు అదుపులో పెట్టుకో

YSRCP MLA Venkata Rosaiah Comments On Sujana Chowdary - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య

పొన్నూరు: ‘సుజనాచౌదరీ.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.. చేతిలో బీజేపీ జెండా పట్టుకుని, జేబులో టీడీపీ కండువా పెట్టుకుని మాట్లాడొద్దు’ అని వైఎస్సార్‌సీపీ పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య హెచ్చరించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రూ.వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన సుజనా.. రాష్ట్రంపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడటానికి సిగ్గుండాలన్నారు. సుజనా తన రాజకీయ గురువు చంద్రబాబు కోసం కొత్త పల్లకీ ఎత్తుకున్నారన్నారు. అమరావతి రాజధానిగా రాక ముందు పేద వర్గాల నుంచి అతి తక్కువ ధరలకు భూములు బెదిరించి తీసుకున్నది మీరు కాదా? అని ప్రశ్నించారు. అసైన్డ్‌ భూములు ప్రజల నుంచి తీసుకోవటానికి జీవో తీసుకువచ్చింది మీ నాయకుడు చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ అమరావతిలో భూములు కొనుగోలు చేశారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నారన్నారు. దానికి మేధావులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటే చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top