'రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది' | ysrcp mla chevireddy slams tdp govt over false cases | Sakshi
Sakshi News home page

'రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది'

Nov 30 2016 3:23 PM | Updated on Oct 29 2018 8:34 PM

'రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది' - Sakshi

'రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది'

రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోపించారు.

కాకినాడ : రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోపించారు. తూర‍్పుగోదావరి జిల్లాలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపులపై ప్రభుత్వం వెంటాడి మరీ కేసులు పెడుతోందన్నారు.

పోలీసు వ్యవస్థను టీడీపీ సర్కారు నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు పచ్చచొక్కాలు వేసుకున్నవారిగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలపై అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పెట్టే కేసులకు తాము భయపడమని, వైఎస్ జగన్కు అండగా ఉంటామని చెవిరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement