'చనిపోయినవారు స్మగ్లర్లా? కూలీలా?' | YSRCP demands to judicial enquiry on Seshachalam encounter | Sakshi
Sakshi News home page

'చనిపోయినవారు స్మగ్లర్లా? కూలీలా?'

Apr 7 2015 11:06 PM | Updated on May 25 2018 7:29 PM

అంబటి రాంబాబు - Sakshi

అంబటి రాంబాబు

శేషాచలం ఎన్కౌంటర్పై న్యాయవిచాణ జరిపించాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

గుంటూరు: శేషాచలం ఎన్కౌంటర్పై న్యాయవిచాణ జరిపించాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా  తిరుపతి శేషాచలం అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగి, దాదాపు 20 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయినవారు స్మగ్లర్లా? కూలీలా? అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని అంబటి డిమాండ్ చేశారు.

తమ కూలీలను ఆంధ్ర పోలీసులు చంపేశారని తమిళ నేతలు అంటున్నారని చెప్పారు. న్యాయవిచారణ జరిపి వాస్తవాలు బహిర్గతం చేయాలని అంబటి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement