సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రంకోసం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన సందర్భంగా అక్కడకు వెళ్లిన తమ పట్ల కాచిగూడ ఎస్సై సైదులు, సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు అమానుషంగా వ్యవహరించారని, అకారణంగా కొట్టారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్రెడ్డి, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు శివకుమార్, హైకోర్టు న్యాయవాది నాగిరెడ్డి తదితరులు కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. ‘‘నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం విషమించడంతో గత నెల 29న జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో మా పార్టీకి చెందిన ప్రతినిధులం ఆస్పత్రికి చేరుకున్నాం. ఆస్పత్రి గేటువద్ద శాంతియుతంగా ఉన్న మాపై సివిల్ దుస్తుల్లోని పోలీసులు విరుచుకుపడ్డారు. మర్మాయవాలపై లాఠీలు, బూటు కాళ్లతో తంతూ విచక్షణారహితంగా చితకబాదారు’’ అని వివరించారు. దాడిలో ప్రతాప్రెడ్డితోపాటు బండారు సుధాకర్, ఎం.సరోజ్రెడ్డి, మాజిద్తోపాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అనంతరం తమను కాచిగూడ పోలీస్స్టేషన్కు తరలించారని, అక్కడ ఎస్సై సైదులు పత్రికల్లో రాయలేనివిధంగా దుర్భాషలాడుతూ మళ్లీ తమపై దాడి చేశారని వివరించారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే వీధిరౌడీల్లా దాడి చేశారని, జగన్కు మద్దతుగా ఎవరూ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ తరహా దాడికి పాల్పడ్డారని తెలిపారు.
జగన్ దీక్షకు మద్దతు తెలిపే తమ హక్కుకు పోలీసులు విఘాతం కలిగించారని, అకారణంగా దాడి చేసి తమ జీవించే హక్కును కాలరాశారని పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద విధుల్లో ఉన్న పోలీసుల ఫొటోలను చూపిస్తే తమపై దాడి చేసినవారిని గుర్తించగలమన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించి తమపై దాడికి పాల్పడిన పోలీసులు, ఎస్సై సైదులుపై క్రిమినల్ చర్యలతోపాటు శాఖాపరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కమిషన్.. ఈ వ్యవహారంపై ప్రత్యక్షంగా విచారణ జరిపి ఈనెల 19లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని తూర్పు మండల డీసీపీని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
పోలీసులా.. రౌడీలా?
Published Tue, Sep 3 2013 5:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement