299వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

YS Jagan 299th Day Prajasankalpayatra Schedule Released - Sakshi

సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 299వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం జననేత విజయనగరం నియోజకవర్గంలోని సురమ్మపేట నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నర్సీపురం, వసుంధర నగర్‌, ఎర్రా క్రిష్ణా కాలనీ, పార్వతీ పురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం పార్వతీ పురంలోని పాత బస్టాండ్‌ సెంటర్‌ వద్ద జరిగే బహిరంగ సభలో జననేత వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top