లారీ ఢీకొని మహిళ మృతి | women died in lorry accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని మహిళ మృతి

Aug 27 2015 12:34 PM | Updated on Oct 20 2018 6:04 PM

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది.

ముత్తుకూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామానికి చెందిన తిరుపతి మాధవి తన కుమారునితో కలసి బైక్‌పై వెళ్తుండగా కృష్ణపట్నం పోర్ట్ బైపాస్ రోడ్డులో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో మాధవి అక్కడికక్కడే చనిపోయింది. ఆమె కుమారునికి గాయలయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement