శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది.
ముత్తుకూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామానికి చెందిన తిరుపతి మాధవి తన కుమారునితో కలసి బైక్పై వెళ్తుండగా కృష్ణపట్నం పోర్ట్ బైపాస్ రోడ్డులో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో మాధవి అక్కడికక్కడే చనిపోయింది. ఆమె కుమారునికి గాయలయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.