పెళ్లిపీటలదాకా వచ్చి.. అంతలోనే బ్రేక్!

సాక్షి, కర్నూల్: నంద్యాలలో పెళ్లిపీటలదాగా వచ్చిన ఓ పెళ్లి ఆగిపోయింది. తిరుపతిలో ఒకరితో నిశ్చితార్థం చేసుకుని.. నంద్యాలలో మరొకరితో వివాహానికి సిద్ధపడ్డాడు వరుడు మోహనకృష్ణ. తిరుపతికి చెందిన యువతి బంధువులు పెళ్లిని అడ్డుకొని ఆందోళనకు దిగారు. దీంతో పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వరుడు మోహనకృష్ణతోపాటు ఆందోళనకు దిగిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లో విచారిస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి