ఈనెల 13న కర్నూలుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ | YS Jagan to visit Kurnool on August 13 | Sakshi
Sakshi News home page

ఈనెల 13న కర్నూలుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

Aug 10 2026 5:37 AM | Updated on Aug 10 2026 5:37 AM

YS Jagan to visit Kurnool on August 13

ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌ 

కర్నూలు (టౌన్‌): మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 13వ తేదీన కర్నూలుకు రానున్నట్లు ఎమ్మెల్సీ, పార్టీ ప్రోగ్రామ్‌ కో–ఆర్డీనేటర్‌  తలశిల రఘురామ్‌ తెలిపారు. ఆదివారం  కర్నూలులో తలశిల మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై  అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం తాడేపల్లి నుంచి కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారని పేర్కొన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సబ్‌జైలుకు వెళ్లి విరూపాక్షిని పరామర్శిస్తారని వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement