కృష్ణాజిల్లాలో ప్రబలిన విషజ్వరాలు | viral fevers in krishna district | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లాలో ప్రబలిన విషజ్వరాలు

Jul 22 2017 12:59 PM | Updated on Sep 5 2017 4:38 PM

కృష్ణా జిల్లాలో విషజ్వరాలు ప్రబలి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విజయవాడ: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండల బొడ్డపాడు గ్రామంలో విషజ్వరాలు ప్రబలి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి చెందిన అరుణకుమారి డెంగ్యూ లక్షణాలతో మృతిచెందగా.. మరో 30 మంది విష జ్వరాలతో ఆస్పత్రి పాలయ్యారు. విషయం తెలుసుకున్న వైఎస్సీ‍ర్సీపీ నాయకులు తాతినేని పద్మావతి, అనిల్‌కుమార్‌ గ్రామానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. తక్షణం గ్రామంలో ప్రభుత్వ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement